ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గద్దర్‌‌కు ఎల్టీటీఈ తీవ్రవాదికి పెద్దగా తేడా ఏమి లేదు.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన కామెంట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 07:22 PM

పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిందని రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. దానికి బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో.. తెలంగాణ తరపున గద్దర్ లాంటి గొప్ప పోరాట వీరుడికి పద్మ అవార్డు ప్రకటించాలని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిపాదన పంపారన్న విషయం బయటికి రావటంతో.. అగ్గిలో మరింత ఆజ్యం పోసినట్టయింది.


ఈ అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తామని.. ఆయన భావాజాలం ఏంటీ..? అంటూ ప్రశ్నించటమే కాకుండా.. ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు. తమ కార్యకర్తలను చంపారని, ఎంతో మంది పోలీసులను పొట్టనబెట్టుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో.. బండి సంజయ్ మీద కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.


బండి సంజయ్ చేసిన కామెంట్లతోనే రాష్ట్రంలో చాలా మంది అగ్గి మీద గుగ్గిలమవుతుంటే.. అది సరిపోదన్నట్టు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి తన వ్యాఖ్యలతో ఇప్పటికే రగిలిపోతున్న అగ్గికి మరింత ఆజ్యం పోశారు. గద్దర్‌‌కు ఎల్టీటీఈ  తీవ్రవాదికి పెద్దగా తేడా ఏమి లేదని విష్ణువర్ధన్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనేక మంది ప్రాణాలు తీసిన నరహంతకుడు గద్దర్ అని కాంట్రవర్సి కామెంట్లు చేశారు.


భారత ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ బద్ద వ్యతిరేకి అని విష్ణువర్దన్ రెడ్డి గుర్తుచేశారు. నిషేధిత మావోయిస్టు సంస్థలో ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. ఎల్టీటీఈ కి కూడా పద్మ అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అంటారా అని ప్రశ్నించారు. లేక గద్దర్ కుమార్తె ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న కారణంగా పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా అని సెటైర్లు వేశారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో గద్దర్‌పై అనేక కేసులు ఉన్నాయని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తుచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa