కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ దేశ యువతకు మరోసారి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు, విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు తగిన ప్రణాళికలు లేకుండా, కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా బడ్జెట్ రూపొందించబడింది. ఈ బడ్జెట్లో ప్రధానంగా యువతపై చూపించిన నిర్లక్ష్య అంశాలు ఉద్యోగ కల్పనపై ఉపేక్ష: దేశంలో నిరుద్యోగిత తీవ్రంగా పెరుగుతుండగా, కొత్తగా ఉద్యోగ అవకాశాలు సృష్టించే విధమైన చర్యలు ఈ బడ్జెట్లో కనిపించలేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగిస్తూ, నిరుద్యోగ యువతను మరింత నిరాశకు గురిచేశారు.
విద్యా రంగానికి తక్కువ కేటాయింపు:
ప్రభుత్వ విద్యా సంస్థలకు తగిన విధంగా నిధులు కేటాయించలేదు. ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, సామాన్యుల పిల్లలకు ఉన్నత విద్యను కలవరపెట్టేలా ఉంది.ఉద్యోగంలో ఉన్నా అనిశ్చితి.కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలను ప్రోత్సహిస్తూ, శాశ్వత ఉద్యోగ భద్రతను దూరం చేస్తోంది. అర్థిక అసమతుల్యతను పెంచే విధంగా కార్మిక హక్కులను హరించే విధానం కొనసాగింది.
రుణ భారం పెరిగిన విద్యార్థులు:
విద్యార్థి రుణాలపై వ్యాజ్యాలు పెరిగాయి, స్కాలర్షిప్లు తక్కువయ్యాయి. సామాన్య వర్గాల విద్యార్థులకు సదుపాయాలు కల్పించకపోవడం వల్ల పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ బడ్జెట్ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా డివైఎఫ్ఐ ఈ బడ్జెట్ను ఖండిస్తూ, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఐ జిల్లా డి .తిరుపతి మండల కార్యకర్తలు సుమన్ హర్ష సుధాకర్ తిరుపతి వెంకన్న వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa