తుర్కపల్లి. రామలక్ష్మణపల్లె గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు గౌడ సంఘ సభ్యులు వైభవంగా నిర్వహిస్తున్నారు. మల్లికార్జున స్వామి వారి కళ్యాణ నేత్రపర్వంగా నిర్వహించారు కళ్యాణానికి మండల ప్రజా ప్రతినిధులు నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం ఒగ్గుడోల్ల నృత్యాలతో శివసత్తుల చిందులతో అగ్నిగుండాలు తొక్కి భక్తులు పులకించారు ఆ ప్రాంతమంతా మల్లన్న నామస్మరణలతో మారుమోగాయి వచ్చిన భక్తులు ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని గౌడ సంఘ సభ్యులు మల్లికార్జున ఆలయ దేవాలయం దాతల సహకారంతో ఆలయ నిర్మాణం వెంకటాపూర్ గ్రామస్తులైన కురుమ యాదవ పెద్దోళ్ల ఎల్లం నిర్మాణం చేపట్టి భక్తుల సహకారంతో ఐదు రోజులపాటు మల్లన్న విగ్రహ ప్రతిష్ట కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు మల్లన్న ఆలయానికి సహకరించిన దాతలకు స్వామివారి కృపాకటాక్షాలు ఆయురారోగ్యాలతో ఉండాలని గౌడ సంఘం సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు గౌడ సంఘ సభ్యులు బైరి శ్రీనివాస్ . చంద్రయ్య గౌడ్ ప్రశాంత్ గౌడ్ రమేష్ ఆశగౌడ్ బాలరాజ్ గౌడ సంఘం కుల బాంధవులు భక్తులు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa