ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సి సేఫ్"యాప్ పై మహిళలు అవగాహన కలిగి ఉండాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 03:33 PM

సి సేఫ్"యాప్ పై మహిళలు అవగాహన కలిగి ఉండాలి, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు యువతీ,యువకులు ఇంటర్ నెట్ సద్వినియోగం చేసుకోవాలని షీ టీం ఏఎస్ఐ కృష్ణమూర్తి అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోదాడ డిఎస్పీ ఆధ్వర్యంలో త్రివేణి డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు... కాలేజీలు హాస్టల్లో మహిళపై వేధింపులు జరిగితే షీ టీం వాట్సాప్ నెంబర్ 8712686056 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
సి సేఫ్ యాప్ పై మహిళలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మొబైల్ యాప్ లో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దు అని తెలిపారు.. గంజాయి మత్తు మందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో.. త్రివేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, షీ టీం కానిస్టేబుల్ యాకూబ్, మహిళ కానిస్టేబుల్ సాయి జ్యోతి, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa