మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామం కొండగట్టు దిగువన ఓ పంక్షన్ హోల్ లో భుధ వారం స్థానిక ఎన్నికల సన్నా హక సమావేశం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ బుధవారం నిర్వహించారు. మండలంలోని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నాయకులతో ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా మళ్లీ ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అబద్దపు మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కరని విమర్శించారు. గడిచిన బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని, అది కేసిఆర్ తోనే సాధ్యమైందని అన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ మోసపూరిత అబద్ధపు హామీలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. నాయకులంతా సమన్వయంతో కలిసి పని చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రజలకు వివరించి గ్రామాలలో గులాబీ జెండా ఎగురవేయాలని అన్నారు. అవకాశం రాలేదని ఎవ్వరూ బాధపడొద్దని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉన్నందున అవకాశాలు కచ్చితంగా వస్తాయని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్, నాయకులు తిరుపతి రెడ్డి,సాగర్ రావు, రవి, మధుసూదన్ రావు , మల్లారెడ్డి,త్రినాథ్,రాయమల్లు,సంజీవ్, దశరథం, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa