తమ పార్టీ నాయకులను అధికార కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని, తాము కూడా పింక్ బుక్ మెయింటెన్ చేస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ట్విట్టర్లో ఎవరైనా కామెంట్ పెట్టినా, ఫేస్బుక్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తే చాలు పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.రాహుల్ గాంధీ తన జేబులో రాజ్యాంగాన్ని పెట్టుకొని తిరుగుతున్నారని, ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ఆమె విమర్శించారు. వేధింపులకు సంబంధించి లెక్కలు ఎలా రాయాలో, ఉద్యమాలు ఎలా చేయాలో తమకు జయశంకర్ సార్ నేర్పించారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.బీసీ బిల్లును కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంది బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుందని కవిత ఆరోపించారు. అసెంబ్లీలో ఒక్క బిల్లు కాకుండా, మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యలో 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, ఉద్యోగాల్లో 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ మేరకు బీసీలకు రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును తీసుకు రావాలని కోరారు.బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయని ఆమె అన్నారు. జాప్యం చేసి ఇతరులు కోర్టులకు వెళ్లే అవకాశం ఇవ్వవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ ఉద్యమాలతో దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడతామని ప్రకటించిందని గుర్తు చేశారు. ఇది బీసీలందరి విజయమని ఆమె వ్యాఖ్యానించారు. కుల గణనకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఇందుకు నెల రోజుల సమయం ఇవ్వాలని ఆమె సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa