ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిలిండర్ల దొంగల అరెస్టు.. ముగ్గురిపై కేసు నమోదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 03:52 PM

అందోలు మండలం నేరడిగుంట చౌరస్తాలో గురువారం తెల్లవారు ఝామున ఒకటి గంటల  టిసెంటర్‌ సెంటర్‌లో రెండు గ్యాస్‌ సిలిండర్‌లను దొంగిలించిన దొంగలను పెద్దారెడ్డిపేట శివారులో స్థానిక ప్రజలు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ పాండు కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డిల్లా జహీరాబాద్‌ మండలం దిడిగి గ్రామానికి చెందిన మహ్మద్‌ ఫిరోజ్, మహ్మద్‌ సద్దాం హుస్సేన్, సహేనా బేగంలు నేరడిగుంట చౌరస్తాలో శేఖర్‌గౌడ్‌కు చెందిన కిరాణం, జనరల్‌స్టోర్‌తో పాటు టీస్టాల్‌లో మూలన ఉన్న రెండు సిలిండర్‌లను ఎత్తుకెళ్లారు. 
ఇదంతా సీసీ పుటేజీల్లో రికార్డయ్యింది. నేరడిగుంట చౌరస్తా నుంచి అదే రోడ్డు గుండా పెద్దారెడ్డిపేట గ్రామంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు అనుమానస్పదంగా కనిపిస్తున్న ముగ్గురిని పట్టుకొని చితకబాదారు. ముగ్గురు దొంగలను జోగిపేట పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేశారు. ఈ ప్రాంతంలో ఏమైనా దొంగతనానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలో వరంగల్‌ ప్రాంతంలో బైక్‌ల దొంగతనం కేసులో జైలుకు వెళ్లివచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ పాండు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa