జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా మహాత్మా గాంధీ వర్ధంతి రోజైనా జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు అవగాహన పక్షోత్సవాలు నిర్వహించడం జరిగినది.అందులో భాగంగా ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డాక్టర్ జి అన్నా ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో పి హెచ్ సి ముత్తారంలో కుష్టు వ్యాధి అవగాహన పక్షోత్సవాల చివరి రోజు కార్యక్రమమును జరుపుకోవడం జరిగినది.ఈ సందర్భంగా పి హెచ్ సి పరిధిలోని కుష్టు వ్యాధిగ్రస్తులకు చెద్దర్లు,బెడ్ షీట్స్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కుష్టు వ్యాధి పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,డాక్టర్ జి.అన్నా ప్రసన్నకుమారి ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం జరిగినది.కుష్టు వ్యాధి అనేది సామాన్యమైన అంటువ్యాధి, ఇది బహుళ ఔషధ చికిత్స ద్వారా పూర్తిగా నయం అవుతుంది. ఈ వ్యాధి మైకో బాక్టీరియం లేప్రే అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. ఈ వ్యాధిని త్వరగా గుర్తించినట్లైతే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు.
ఈ వ్యాధి యొక్క లక్షణాలు చర్మం పైన స్పర్శ లేనటువంటి రాగి రంగులో లేదా గోధుమ రంగులో పాలిపోయిన ,మొద్దు బారిన మచ్చలు. ఇవి ఉన్నట్లయితే అనుమానించి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సంప్రదించ గలరు.ఈ వ్యాధి శాపము, పాపము ద్వారా రాదు మరియు వంశ పారంపర్యంగా కూడా రాదు అని అన్నారు. 2027 నాటికి కుష్టు వ్యాధి రహిత భారత దేశంగా ఏర్పరచడం కోసం ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని వారు కోరడం జరిగింది.
ఈ కార్యక్రమము లో లెప్రసీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి,ఇతర ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీరాములు,డాక్టర్ కిరణ్ కుమార్,పి.హెచ్.సి.మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమరేందర్ రావు,డిపిఎమ్ఓలు సువార్త, రమేష్,దేవి సింగ్,పీహెచ్సీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించి,ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa