ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాగు నీటి విడుదలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 08:13 PM

 రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకొని పంటలకు నీరందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను చెప్పారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పారు. రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని, రాష్ట్ర మంతటా అన్ని ప్రాంతాల్లో సాగు, తాగునీరు, విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని, వెంటనే సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి జిల్లాల వారిగా అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa