ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చికెన్‌ బిర్యానీ ఆర్డర్లు తగ్గుముఖం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 11:21 AM

గతకొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ భయం రెండు తెలుగు రాష్ట్రాలను వణకిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకి లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దాని ప్రభావం చికెన్ విక్రయాలపై పడింది. హైదరాబాద్ నగరంలో గతంలో పోలిస్తే విక్రయాలు సగానికి పైగా పడిపోయాయి. ఈ ఆదివారం 40 శాతం మాత్రమే విక్రయాలు సాగాయని వ్యాపారులు వాపోతున్నారు. తాజాగా.. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ వంటకాలపైనా పడింది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ గట్టిగానే పడినట్లు హోటల్ యజమానులు చెబుతున్నారు. బిర్యానీ వినగానే మాంసాహార ప్రియులకు పండగే. లొట్టలు వేసుకుంటూ లాగించాల్సిందే. చికెన్‌ బిర్యానీ అంటే మరింత మక్కువ. కానీ.. ప్రస్తుతం నగరంలో చికెన్‌ బిర్యానీల విక్రయాలు తగ్గిపోయాయి. ఫిష్, మటన్‌ బిర్యానీల వైపు మొగ్గు కనిపిస్తోంది. చికెన్‌ బిర్యానీ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీని అంతటికీ కారణం బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌. ఈ వైరస్‌ కారణంగా కోళ్లు చనిపోతుండటంతో చికెన్‌ బిర్యానీల విక్రయాలు ఒక్కసారిగా పడిపోయాయి.చికెన్‌తో చేసే వంటకాలకూ డిమాండ్‌ తగ్గిపోవడంతో హోటళ్ల పరిశ్రమ లబోదిబోమంటోంది. ఈ పరిణామాలు చివరికి గిగ్‌వర్కర్లపైనా పడింది. టేక్‌ అవే.. ఇతర ఆన్‌లైన్‌ ఆర్డర్లు కూడా తగ్గిపోవడంతో స్విగ్గీ, జొమాటో తదితర ఆహార పదార్థాల సరఫరాల రంగంపైనా ప్రభావం చూపుతోంది. ఐకానిక్‌ చికెన్‌ బిర్యానీ పరిస్థితి ఇలావుంటే.. కోడిగుడ్ల అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి. గ్రేటర్‌ పరిధిలో ప్రతిరోజు 15 నుంచి 20 లక్షల చికెన్‌ బిర్యానీలు అమ్ముడవుతుండగా.. తాజాగా ఇవి సగానికి తగ్గిపోయినట్లు ప్రముఖ హోటల్‌ షాదాబ్‌ యజమాని స్పష్టం చేశారు. దీని స్థానంలో శాకాహార వంటకాలు లేదా మాంసం, సీ ఫుడ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa