ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మొక్క నాటిన తాసిల్దార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 09:52 PM

ఈరోజు చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల సమీపంలోని మంచినీటి ట్యాంకి వద్ద నెక్కొండ తహసిల్దార్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వేముల రాజకుమార్ వారిచే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అవార్డు గ్రహీత వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య అల్ల నేరేడు పండ్ల మొక్క నాటించడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ రాజకుమార్ మాట్లాడుతూ మానవాలి పశుపక్షాదులకు చెట్లే మూలాధారం. కాలుష్యం నివారించడానికి పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి ప్రకృతికి పాటుపడుతున్న సమ్మయ్య ను ఆదర్శంగా తీసుకొని యువకులు మీ ఇంటి వద్ద 1 పండ్ల మొక్కను నాటాలన్నారు. సమ్మయ్య 25 సంవత్సరంల నుండి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే మొక్కలు నాటడం అలవాటు చేసుకొని గుడులు బడులు స్మశాన వాటికలు రచ్చబండలు చెరువు కట్టలు ప్రభుత్వ కార్యాలయాలు మొదలగు ప్రవేశాలలో అధికారులతో అనధికారులతో రాజకీయ నాయకులతో ఇప్పటివరకు 50 వేల పైచిలుకు మొక్కలు నాటడం ముండ్ల కంచె ఏర్పాటు చేసి నీళ్ళు పోసి చెట్లను పెంచడం వృక్షాలు కావడం ఇతను సేవ దేశానికి ఆదర్శనీయమన్నారు. ఇప్పుడు అందుకున్న అవార్డులే కాకుండా ఇంకా మునుముందు అవార్డులు ప్రశంస పత్రాలు  అందుకోవాలని మంచి పేరు ప్రతిష్టలు తేవాలని తహసిల్దార్ రాజ్ కుమార్ సమ్మయ్య ను అభినందించారు. చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ తహసిల్దార్ పల్లకొండ రవి చైన్మెన్ లాక సూరయ్య పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa