మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నేటి నుంచి కొత్త రేషన్కార్డులను పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో 1,21,016, గ్రామ సభలు, వార్డు సభల్లో 33,435 దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం అధికారులకు అందాయి. ఇందులో 33,435 దరఖాస్తుల వంద శాతం డాటా ఎంట్రీ పూర్తయ్యింది. కులగణన ద్వారా విచారణ చేపట్టిన అధికారులు 6,700 మందిని అర్హులుగా గుర్తించారు. వారికి కార్డులు అందజేసే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభంకానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa