తెలంగాణలో మల్టీప్లెక్స్లకు హైకోర్టులో ఊరట లభించింది. 16 సంవత్సరాల లోపు చిన్నారులను అన్ని షోలకు అనుమతించాలని ఆదేశించింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సవరించింది. అయితే ప్రీమియర్, బెన్ఫట్ స్పెషల్ షోలకు మాత్రం పిల్లల అనుమతికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల17కు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. కాగా.. జనవరి 21న 16 ఏళ్ల లోపు పిల్లలు మల్టీప్లెక్స్ థియేటర్కు వెళ్లే విషయంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.సమయాబావం లేకపోవడంతో పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు పలు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 సంవత్సరాల లోపు చిన్నారులు వెళ్లకూడదు అని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించాలని హైకోర్టు ధర్మాసనం కోరింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ యాజమాన్యం పోరాడుతోంది. బెనిఫిట్ షో, స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ తాజాగా 16 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించే విషయంలో ఉత్తర్వులను హైకోర్టు సవరణ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa