ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరీ జగన్నాథ ఆలయంలో వింత సంఘటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 04:22 PM

పూరీ జగన్నాథ ఆలయంలో ఆదివారం ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ఆలయ శిఖరంపై ఎగురవేసే జగన్నాథుడి పవిత్ర జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లింది. జెండాను తన నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఇది చూసిన భక్తులు ఆశ్చర్యంతోపాటు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది భక్తులు ఈ ఘటనను తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. జగన్నాథుడి దర్శనం కోసం పూరీ వచ్చే భక్తులు తొలుత ఈ పతితపావన జెండాకు నమస్కరించుకుంటారు. ఆపై ఆలయంలోకి వెళ్లి జగన్నాథుడి దర్శనం చేసుకుంటారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజూ మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa