ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాణ్యమైన విద్యతో దేశ భవిష్యత్తు తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 04:13 PM

12వ శతాబ్దంలో సామాజిక చైతన్యం, సమసమాజ నిర్మాణానికి సంఘ సంస్కర్త బసవన్న పునాది వేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన విద్య ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని, దళితులు, గిరిజనులకు సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా విధానాలు, పనితీరు పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు. బసవన్న స్ఫూర్తితో సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa