ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 15 నుండి తిరుపతిలో ఏఐవైఎఫ్‌ జాతీయ మహాసభలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 02:04 PM

ఏఐవైఎఫ్‌ (ఆల్‌ ఇండియా యూత్‌ ఫెడరేషన్‌) 17వ జాతీయ మహాసభలు మే 15 నుండి 18 వరకు తిరుపతిలో జరగనున్నాయి. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆరెపల్లి మానస్‌ కుమార్‌ మరియు కార్యదర్శి మార్కపురి సూర్య పిలుపునిచ్చారు.
బుధవారం పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద జాతీయ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ తగులుతోందని వారు వ్యాఖ్యానించారు.
ఈ మహాసభల ద్వారా యువతలో చైతన్యం పెంచుతూ, దేశ ప్రగతిలో వారి పాత్రను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నేతలు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa