నార్నూర్ మండలంలోని మహాగావ్-షేకు గూడ గ్రామ ప్రజలకు తాగునీటి కష్టాలు ఇక చరిత్రలోకి చేరనున్నాయి. గత కొంతకాలంగా తాగునీటి లభ్యత లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం దొరికింది.
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ ఆత్రం సుగుణక్క చొరవతో బుధవారం గ్రామంలో ప్రభుత్వం నిధులతో బోరు బావి వేయించారు. ఉదయం గ్రామస్తులు బోరు మిషన్కు పూజలు నిర్వహించి, అధికారికంగా ప్రారంభించారు. కొద్ది సేపటికే బోరు నుంచి నీరు ఉబికి రావడంతో గ్రామస్తులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న సుగుణక్కకు, బోరు మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి సీతక్కకు గ్రామ ప్రజలు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు తాగునీటి కోసం మైలలు దూరం నడవాల్సిన పరిస్థితి ఉండగా, ఇక నుంచి స్వగ్రామంలోనే తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రానుండటంతో వారిలో ఉత్సాహం నెలకొంది.
ఇది గ్రామ అభివృద్ధి దిశగా మరో ముందడుగుగా గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ అభివృద్ధికి కారకులైన అధికారులకు, నాయకులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాజిటివ్గా స్వీకరించారు. ఇలాగే మరిన్ని సమస్యలు కూడా పరిష్కారమవాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa