భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. తన ట్వీట్లో 1965లో పాక్పై సైన్యాన్ని విజయవంతంగా ముందుకు పంపిన ఘనత కాంగ్రెస్దేనని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో ఈ తరహా రాజకీయ వ్యాఖ్యలు అనవసరమా అంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వీరిని స్ఫూర్తిగా తీసుకుని తర్వాతి భారత ప్రభుత్వాలు.. ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే ఉండి తీరుతాయి అన్నది సత్యం అన్నారు విజయశాంతి. అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ, ప్రజలెవ్వరమూ రాజకీయం అనే కోణంలో ఈ అంశాన్ని చూడటం లేదు అన్నారు. అలానే ఆ కొందరు కూడా దీన్ని అర్థం చేసుకోగలగాలని అభిప్రాయపడుతున్నాను అంటూ విజయశాంతి చురకలు వేశారు.ఇక భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. ఇరు దేశాల మధ్య సఖ్యతకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో.. అమెరికా సెక్రటరీ మార్కో రూబియో ఫోన్లో మాట్లాడారు. అంతేకాక పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు కూడా మార్కో రుబియో ఫోన్ చేశారు. తక్షణమే రెండు దేశాలు ఉద్రిక్తతలను ఆపేయాలని హితవు పలికారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు అమెరికా మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa