ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ శాంతిని కోరుకోవడం వల్లే ఇన్నాళ్లూ యుద్ధం జరగలేదని వ్యాఖ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 06:32 AM

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, వారికి మద్దతు పలికే శక్తులపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ నిజంగా యుద్ధానికి సిద్ధపడితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ అదృశ్యమవుతుందని ఆయన హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ శాంతిని కోరుకుంటున్నందునే ఇన్ని రోజులుగా యుద్ధ వాతావరణం తలెత్తలేదని, దేశం గొప్ప సంయమనం పాటిస్తోందని అన్నారు.ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొన్న సందర్భంగా రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. గత మూడు రోజులుగా 'ఆపరేషన్ సింధూర్' పేరిట ధర్మయుద్ధం జరుగుతుంటే, ఈ దేశంలోనే ఉంటూ కొందరు దానిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వీరిలో కమ్యూనిస్టులు, వివిధ రంగుల జెండాలు కలిగిన నాయకులు, పాత్రికేయుల ముసుగులో కొందరు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు."ఉగ్రవాదులను హతమారుస్తుంటే వీరికి ఎందుకు అంత బాధ? మతం చూసి మరీ దాడులు చేస్తుంటే ఈ మేధావులు ఎక్కడ ఉన్నారు నిరంతరం హత్యలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా" అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కాళ్లకు పారాణి ఆరకముందే సింధూరం కోల్పోయిన ఆడబిడ్డల ఆవేదనను ప్రస్తావిస్తూ, వారి ఆర్తనాదాల వల్లే ఇద్దరు మహిళలు ధర్మ యుద్ధానికి సారథ్యం వహించారని తెలిపారు.ఈ దాడుల్లో ఏ ఒక్క పాకిస్థానీ సామాన్యుడినీ లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం ఉగ్రవాదుల స్థావరాల పైనే దాడులు జరిగాయని స్పష్టం చేశారు. దేశం చూపిస్తున్న సహనాన్ని చేతకానితనంగా భావిస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa