కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని హంగర్ల గ్రామంలో కురుమల ఆరాధ్య దైవం బాలు మామ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు పాల్గొన్నారు..ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి కురుమ కులస్తులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులు గల త్రివేణి సంగమంగా పిలిచే జుక్కల్ నియోజకవర్గంలో మూడు రాష్ట్రాల సంస్కృతులు, సాంప్రదాయాలు కలగలిసి జుక్కల్ నియోజకవర్గ ప్రజలు ఆధ్యాత్మిక, భక్తి భావనలు అత్యధికంగా కలిగి ఉంటారని అన్నారు..బాలు మామ 1892 సంవత్సరంలో కర్ణాటకలోని బెలగాం జిల్లాలో జన్మించారాని..గొప్ప శివ భక్తుడిగా ప్రాచుర్యం పొందిన బాలు మామ ఒక వైపు ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ, మరోవైపు సమాజంలోని బలహీన వర్గాల ప్రజలను చైతన్య పరుస్తూ వారి విద్యాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు..ఆధ్యాత్మికత, భక్తి భావనలు వెల్లి విరిసే జుక్కల్ నియోజకవర్గంలో ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా శాంతి, సామరస్యాలు పెంపొందాలని బీర్ల అయిలయ్య గారు ఆకాంక్షించారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa