ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లంచం డబ్బులు టీషర్టులో దాచే ప్రయత్నం,,,,బెడిసికొట్టిన వ్యూహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 07:29 PM

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా పనులు జరగడం లేదనే భావన చాలా మందిలో ఉంది. నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు ఉన్నప్పటికీ.. కొందరు అవినీతికి పాల్పడటం వల్ల వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. తాజాగా... రాజన్న సిరిసిల్ల నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లంచం తీసుకొని అతి తెలివి ప్రదర్శించాడు. లంచం తీసుకొని తప్పించుకునే ప్రయత్నం చేసినా.. అది బెడిసికొట్టింది. వివరాల్లోకి వెళితే.. హనుమకొండకు చెందిన ఒక కాంట్రాక్టర్ సిరిసిల్ల జిల్లాలో రూ.8 కోట్ల చెక్‌డ్యామ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాడు. అయితే పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం అమరేందర్‌రెడ్డి లంచం అడిగాడు. గతంలోనే రూ.4 లక్షలు లంచం తీసుకున్న ఈఈ.. మిగిలిన రూ.50 లక్షల బిల్లు కోసం మరో రూ.75 వేలు డిమాండ్ చేశాడు.


అయితే, కథ ఇక్కడే ఊహించని మలుపు తిరిగింది. లంచం విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు అతడ్ని పట్టుకునేందుకు ఇంటికి వెళ్లారు. ఏసీబీ అధికారులు తన ఇంటికి వస్తున్నారని ముందే పసిగట్టిన అమరేందర్‌రెడ్డి లంచం డబ్బును దాచే ప్రయత్నం చేశాడు. అతి తెలివి ఆలోచనతో ఆ డబ్బును తన చిన్న కుమారుడి టీషర్ట్‌లో చుట్టి ఎవరికీ కనిపించకుండా ఇంటి వెనుక వైపు విసిరివేశాడు. ఆ తర్వాత అమాయకంగా ఏమీ ఎరగనట్టు నటించాడు. కానీ ఆ విషయాన్ని పసిగట్టిన ఏసీబీ అధికారులు లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో లంచం తీసుకున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అమరేందర్‌రెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు కరీంనగర్ అనిశా కోర్టులో హాజరుపరచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. ఈ ఘటన అవినీతిపరులు ఎంత తెలివిగా తప్పించుకోవాలని ప్రయత్నించినా.. చట్టం తన పని తాను చేస్తుందని మరోసారి నిరూపించింది.


ఇటీవల ఓ పోలీస్ అధికారి కూడా అతి తెలివిగా లంచం డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశాడు. శామీర్‌పేట ఎస్సై ఎం.పరశురాం రూ.2.22 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యాపారిని తప్పుడు కేసుతో బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. టేబుల్ పక్కనున్న చెత్త డబ్బాలో డబ్బు వేయమని చెప్పగా.. బాధితుడు వెళ్లగానే లెక్కిస్తుండగా పట్టుబడ్డాడు. లంచం సొత్తు స్వాధీనం చేసుకుని ఎస్సైని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన పోలీసు శాఖలోని కొందరి అవినీతిని మరోసారి బయటపెట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa