ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహబూబ్‌నగర్‌లో ప్రపంచ సుందరీమణుల సందర్శన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 11:23 AM

మిస్ వరల్డ్ పోటీల కోసం భారత్‌కు వచ్చిన ప్రపంచ సుందరీమణులు శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్‌లోని ప్రఖ్యాత పిల్లలమర్రిని సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి వారిని ఆహ్వానించి సన్మానించారు. పిల్లలమర్రి యొక్క చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను వారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, పర్ణికా రెడ్డి, వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. సుందరీమణుల సందర్శన జిల్లా పర్యాటక రంగానికి ప్రతిష్టను తెచ్చినట్లు నాయకులు అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa