తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఇజ్రాయెల్ జాతీయ జెండాను ఓ యువకుడు తొలగించాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం తిరిగి జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ జెండాకు తెలంగాణ సెక్రటేరియట్కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..? హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు పాల్గొంటున్నారు. కంటెస్టెడ్ దేశాలకు చెందిన జాతీయ జెండాలను తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్ ఆవరణలో ఏర్పాటు చేసింది.
అయితే, నగరానికి చెందిన జకీర్ అనే యువకుడు ఆ జెండాను ఇటీవల తొలగించాడు. సోషల్ మీడియాలో లైవ్స్ట్రీమ్ చేస్తూ.. సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్ జాతీయ జెండాను తొలగించాడు. ఈ చర్య తీవ్ర దుమారం రేపింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు.. జకీర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి నేరాల కింద అతడిపై కేసులు పెట్టారు. అనంతరం, అధికారులు సచివాలయం వద్ద తిరిగి ఇజ్రాయెల్ జెండాను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భాగంగా కంటెస్టెంట్లకు ఉత్సాహభరితమైన స్పోర్ట్స్ డే ఈవెంట్ను నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చిన అందాల పోటీదారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పది రకాల క్రీడాంశాల్లో వీరు తమ అథ్లెటిక్ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ జూలియా మోర్లీ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన్ రెడ్డి, సెక్రటరీ మల్లారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. వారి సమక్షంలో కంటెస్టెంట్లు క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు.
స్పోర్ట్స్ డేతో పాటు, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణ సంస్కృతిని, వారసత్వాన్ని తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా, వారు చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన పిల్లలమర్రిని శుక్రవారం సందర్శించారు. మర్రి చెట్టు సహజ సౌందర్యాన్ని, చుట్టుపక్కల ప్రాంతాల ప్రత్యేకతను వారు ఆసక్తిగా తెలుసుకున్నారు. ఇలాంటి సందర్శనలు కంటెస్టెంట్లకు తెలంగాణ రాష్ట్రం గొప్ప సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు, వారికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. కాగా, మిస్ వరల్డ్ పోటీలు కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా, క్రీడా స్ఫూర్తిని, సాంస్కృతిక అవగాహనను పెంపొందించేలా నిర్వహించడం విశేషం. మే 31న హైదరాబాద్లో జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa