ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యేకు శుభలేఖ అందించిన బ్రాహ్మణవెల్లంల వాసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 12:18 PM

నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల (కొత్తగూడెం) గ్రామానికి చెందిన చిరుమర్తి అంజయ్య, యాదమ్మ దంపతుల కుమార్తె ఉమారాణి వివాహం బుధవారం నాడు నార్కట్‌పల్లిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ గార్డెన్స్‌లో ఘనంగా జరగనుంది.
ఈ సందర్భంగా వధువును ఆశీర్వదించేందుకు మరియు వివాహానికి ఆహ్వానించేందుకు గ్రామ ప్రజలు మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను నకిరేకల్‌లో కలిసి శుభలేఖ అందజేశారు.
ఈ కార్యక్రమంలో అంజయ్య, నరసింహ, క్రిష్ణ, ఉపేందర్, వెంకన్న, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. వధువుకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa