రాజ్భవన్లో చోటు చేసుకున్న చోరీ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఉన్న నిందితుడి పని తీరును వివరిస్తూ అధికారులు సంచలన విషయాలను వెలికితీశారు.
పోలీసుల ప్రకారం, శ్రీనివాస్ అనే ఉద్యోగి తన సహోద్యోగిగా పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చాడు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి శ్రీనివాస్ను సస్పెండ్ చేసింది. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
అయితే, బెయిల్ పై బయటకు వచ్చిన శ్రీనివాస్, తన తప్పు ఆధారాలను తొలగించేందుకు మరొకసారి రాజ్భవన్లోకి ప్రవేశించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హెల్మెట్ ధరించి అనుపమంగా లోపలికి ప్రవేశించిన అతడు, తాను ఉపయోగించిన కంప్యూటర్లో ఉన్న మార్ఫింగ్ చేసిన ఫోటోల హార్డ్ డిస్క్ను తీసుకొని వెళ్లాడు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాజ్భవన్ వంటి ప్రాముఖ్యమైన స్థలంలో భద్రతా లోపాలు బయటపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సంబంధిత అధికారులపై కూడా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa