ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో విద్యుదాఘాతంతో వరుస మరణాలు.. ఇద్దరు కూలీలు, ఇతరులు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 04:32 PM

తెలంగాణలో విద్యుదాఘాత ఘటనలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కంబాపూర్‌లో ఇద్దరు కూలీలు విద్యుదాఘాతంతో మృతి చెందారు. బోరుబావి నుంచి మోటారు తొలగిస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి ఈ దుర్ఘటన సంభవించింది.
అలాగే, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్న నరేశ్ కరెంట్ షాక్‌కు గురై మరణించాడు. ఇక ఖమ్మం జిల్లా కొత్తూరులో సోమవారం నాడు పొలానికి వెళ్తున్న మురళీధర్ రెడ్డి (59) విద్యుదాఘాతంతో సజీవ దహనమయ్యాడు.
విద్యుత్‌ సంబంధిత భద్రతా చర్యల పట్ల అవగాహన పెంచాలని, ఇలాంటి దుర్ఘటనలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa