ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలన.శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి విలేజ్ లోని రంగనాథ్ నగర్ ను సందర్శించిన హైడ్రా కమిషనర్.రంగనాథనగర్ ప్లాట్ ఓనర్ల సంఘం యిచ్చిన ప్రజావాణి ఫిర్యాదుపై వాకబు చేసిన హైడ్రా కమిషనర్. ప్లాట్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారు కమిషనర్ ను కలసి తమ ప్లాట్లు కబ్జా చేశారంటూ వాపోయారు.1985 లో 184 ఎకరాల పరిధిలో 850కి పైగా ప్లాట్లతో లేఔట్ వేయగా తామంతా కొన్నామని చెప్పారు2021 కరోనా సమయంలో ప్రపంచమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విలవిలలాడితే బడా రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులు సమూహంగా ఏర్పడి మా లేఔట్ మొత్తాన్ని కబ్జా చేశారంటూ కమిషనర్ ముందు వాపోయారు. అప్పటికే కొంతమంది ఇళ్లను కట్టుకుని ఉండగా మమ్మల్ని తరిమేసి యిల్లను నేలమట్టం చేసి రహదారులు, పార్కులు కలిపేసి వ్యవసాయ భూమిగా మార్చేశారని వాపోయారు.ఆఖరకు అందులో ఉన్న దేవుడి గుడిని కూడా వదల్లేదని ఫిర్యాదు చేసారు.
తాము కోర్టులను ఆశ్రయించామని.. వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లిందని బాధితులు తెలిపారు. సుప్రీమ్ కోర్టు సూచనల మేరకు హై కోర్టు తమకు 4 వారాల్లో న్యాయం చేయాలని తీర్పు యిచ్చిన విషయాన్ని గుర్తు చేసారు.ఈ తీర్పు ప్రకారం ఆక్రమణలను తొలగించాలని ghmc డిప్యూటీ కమిషనర్ నోడల్ అధికారికి ఆదేశాలిచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ప్లాట్ ఉందనీ తాము ఆ స్థలం దరిదాపులకు వచ్చినా మా మీద దాడులు చేశారంటూ కన్నీరుమున్నీరు అయ్యారు. నిత్యం వందలాది మంది బౌన్సర్ల ను అక్కడ కాపలా పెట్టు అటు వైపు చూడడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారని ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు దారులు చెప్పినది విన్న కమిషనర్.... వారం 10 రోజుల్లో ఇరుపక్షాలను పిలిపించి మాట్లాడుతాను అని.. ఆందోళన చెందవద్దని ప్లాట్ యజమానులకు కమిషనర్ చెప్పారు.
అన్ని కోణాల్లోనూ పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. అంతకు ముందు మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంతాల్లో కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ పర్యటించారు. దేవాదాయ శాఖ ట్రస్ట్ భూములను ఆక్రమించి ఆ పక్కనే ఉన్న మా లేఔట్ ను కబ్జా చేయడానికి మాజీ mla ప్రయతిస్తున్నారని శ్రీ మాత అరవింద కాలనీ వాళ్ళు కమిషనర్ కు ఫిర్యాదు చేసారు.
సర్వే నెంబర్ 33/10లో మొత్తం 13 ఎకరాలు ఉండగా అందులో 7 ఎకరాలలో మాత అరవింద్ కాలనీ లేఔట్ దశాబ్దాల క్రితం 444 ప్లాట్లతో ఏర్పడిందన్నారు. మా లేఔట్ పక్కనే మాజీ ఎమ్మెల్యేకు చెందిన స్థలం ఉండగా మా లేఔట్ దేవాదాయ శాఖ భూములంటూ కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటున్నాడని వాపోయారు. అదే ప్రాంతంలో బోడుప్పల్ విలేజ్ లో లేఔట్లో వికాస్ వెల్ఫేర్ కాలనీ లో 70 ప్లాట్లు ఉండగా అందులో 35 ప్లాట్లు కలిగిన రాజకీయ నాకుడు, గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి తమ ప్లాట్లు కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ లేఔట్ లో రోడ్లు, పార్కులు లేకుండా చేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేసారు. అలాగే శ్మశాన వాటికలున్న స్థలం తనదంటూ ప్లాట్లు వేసి విక్రయాలు చేపట్టారన్న ఫిర్యాదును పరిశీలించారు. గోపన్నపల్లిలో హౌసింగ్ బోర్డుకు కేటాయించిన దాదాపు 60 ఎకరాల భూమి లో ఫెన్సింగ్ వేయనియ్యడం లేదని స్థానిక అధికారులు ఫిర్యాదు చేయగా కమిషనర్ రిశీలించారు. షేక్పేటలోని ou కాలనీలో రోడ్ల అక్రమాలపై ఫిర్యాదు రావడంతో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించారు. ప్లాట్ ఓనర్లతో చర్చించి .. సంబంధిత పత్రాల ను అందజేయాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa