ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : మందమర్రి సీఐ కే శశిధర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 22, 2025, 12:28 PM

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని రామకృష్ణాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం బొక్కల గుట్ట గ్రామంలో రోడ్డు భద్రత కమిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్ఐ జి రాజశేఖర్, పోలీస్ సిబ్బందితో కలిసి బొక్కలగుట్ట గ్రామంలో రోడ్డు భద్రత కమిటినీ ఏర్పాటు చేసి, గ్రామ ప్రజలకు రోడ్డు ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా సిఐ కే శశిధర్ రెడ్డి, ఎస్ఐ జి రాజశేఖర్ లు మాట్లాడుతూ, రోడ్డు ప్రయాణాలు చేసేప్పుడు మద్యం తాగి వాహనాలు నడపవద్దని, రాంగ్ రూట్ లో వెళ్లవద్దని, త్రిబుల్ డ్రైవింగ్, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం లాంటివి చేయవద్దని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదలకు గురికాకుండా వాహనదారులు తప్పనిసరిగా పాటించవలసిన ట్రాఫిక్ నియమాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలను, యువకులను, వాహనదారులను కలిపి రోడ్డు భద్రత గ్రామ కమిటీ గా ఏర్పాటు చేసి, గ్రామంలోని కిషన్ ను కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ ఏఎస్ఐ వెంకయ్య, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ సురేష్, రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa