ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడేళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారం.. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 12:09 PM

మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలంలోని ఓ గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. 
ఈ ఘటన గురించి తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి, నిందితుడైన 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని జువైనల్ హోంకు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa