ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై మిత్ర దేశాలని సహాయం అడగం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 01:42 PM

మిత్రదేశాలు తమను కేవలం సహాయం అర్థించే దేశంగా చూడటం లేదని.. వాణిజ్యం, పెట్టుబడులు, నూతన ఆవిష్కరణల్లో సమాన భాగస్వామిగా పరిగణిస్తున్నాయని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ "పాకిస్థాన్‌కు చైనా ఎప్పుడూ అండగా నిలిచే మిత్రదేశం. అలాగే సౌదీ అరేబియా, తుర్కియే, ఖతర్‌, యూఏఈ, అజర్‌బైజాన్‌ వంటి దేశాలు కూడా అత్యంత విశ్వసనీయమైన స్నేహితులు. ప్రస్తుతం ఈ దేశాలన్నీ మాతో వాణిజ్యం, ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో పరస్పరం కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాయి. మేము నిధుల కోసం ‘భిక్షాపాత్ర’తో వారి వద్దకు రావాలని వారు కోరుకోవడం లేదు" అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa