ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ వైష్ణవ సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా లక్ష్మీనరసింహాచార్యులు ఎన్నిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 05:27 PM

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ ఎదులాబాద్‌కు చెందిన అంబారీపేట లక్ష్మీనరసింహాచార్యులు శ్రీ వైష్ణవ సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నగరంలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో లక్ష్మీనరసింహాచార్యులు నేతృత్వంలోని ప్యానెల్‌ పూర్తి మెజారిటీతో విజయం సాధించింది. 
ఈ విజయంతో ఎదులాబాద్‌ గ్రామంలో ఆనందోత్సవాలు జరిగాయి. గ్రామస్తులు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకులు లక్ష్మీనరసింహాచార్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa