ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 12:49 PM

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇల్లు మంజూరైనట్టు చెప్పడంతో రూ.2 లక్షలు అప్పు చేసి బేస్ మెంట్ నిర్మించగా, ఇండ్ల జాబితా రద్దయిందని చెప్పడంతో తీవ్ర ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న బాధితుడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన నీరటి పర్శరాములు (42) అనే వ్యక్తి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా, ఇల్లు మంజూరైందని, బేస్ మెంట్ వేసుకోమని చెప్పిన స్థానిక కాంగ్రెస్ నాయకులు. రూ.2 లక్షలు అప్పు చేసి బేస్ మెంట్ వేసుకోగా, మంజూరైన జాబితా రద్దైనట్టు తెలిపిన నాయకులు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ పర్శరాములు. తన భర్త చావుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆవేదన వ్యక్తం చేసిన పర్శరాములు భార్య


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa