దేవుడి భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. దేవుడి భూములను కబ్జా చేసినట్లు తెలిస్తే వారిపై పీడీ యాక్ట్ పెట్టి శిక్షిస్తామని హెచ్చరించారు. నేడు గురువారం వరంగల్ వెళ్తున్న సమయంలో.. మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల ఐఓసీ వద్ద కబ్జా చేసిన దేవాదాయ భూములను మంత్రి కొండా సురేఖ పరిశీలించారు. స్థానికులు కొందరు ఈ భూకబ్జా గురించి తనకు ఫిర్యాదు చేశారని కొండా సురేఖ చెప్పుకొచ్చారు.
కొందరు భూబకాసురులు తమ భూములను మాత్రమే కాక దేవాదాయ భూములను కూడా కబ్జా చేశారని స్థానికులు తనకు ఫిర్యాదు చేసినట్లు కొండా సురేఖ వెల్లడించారు. గురువారం నాడు వరంగల్ వెళ్తున్న సమయంలోనే ఆమె ఇక్కడ ఆగి.. అధికారుల సమక్షంలో ఈ భూములను పరిశీలించారు. అంతేకాక ఈ భూములపై సర్వే నిర్వహిస్తున్నామని.. త్వరలోనే ఆ రిపోర్టు ఆధారంగా సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలానే బోడుప్పల్ పరిధిలోని మూడు సర్వే నంబర్లలో దేవాదాశ శాఖకు సంబంధించి 30 ఎకరాలకు పైగా భూమి ఉందని తెలిపారు. అయితే కొందరు ఈ భూమిని ఆక్రమించుకుని.. అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టారని.. త్వరలోనే వీరిపై చర్యలు తీసుకుంటామని కొండా సురేఖ హెచ్చరించారు.
ఇక నాలుగు రోజుల క్రితం కొండా సురేఖ వరంగల్ భద్రకాళీ ఆలయ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న వేదపాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోటి రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ వేద పాఠశాలను సంవత్సరంలోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ఎవరైనా దేవాలయాల భూములను కబ్జా చేస్తే.. వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములను సంరక్షించడం కోసం.. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆతర్వాత వీటిని ఆన్లైన్లో చేరుస్తామన్నారు. దేవుడి భూములను కబ్జా చేసినవారు.. తమంటతామే వాటిని అప్పగించాలని.. లేదంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుమన్నారు. ఇప్పుడు తాజాగా దేవుడు భూములు కబ్జా చేసే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు.
అలానే తాజాగా కొండా సురేఖ హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల ఏర్పాట్లపై సమక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు మరీ ముఖ్యంగా ఆడవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa