సింగరేణి సంస్థ ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారి కుటుంబాలకు నమ్మకం, భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది. ఇంతకు సంస్థ తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. కార్మికుల కోసం ఆ సంస్థ మరో బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం ఇకపైన సింగరేణి కార్మికులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబాలకు రూ.1.25 కోట్లు పరిహారం అందించనుంది. ఈమేరకు బుధవారం నాడు సింగరేణి సంస్థ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ మాట్లాడుతూ.. ఇది అత్యద్భుత నిర్ణయమని ప్రశంసించారు. ప్రమాదవశాత్తు కార్మికులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ బీమా పథకాన్ని తీసుకువచ్చాం అని తెలిపారు. అయితే ఇప్పటికే సింగరేణి సంస్థ.. కార్మికుల కోసం కోటి రూపాయల బీమా పథకాన్ని అమలు చేస్తుంది. ఇప్పుడు తీసుకువచ్చిన రూ.1.25 కోటి బీమా పథకం.. దీనికి అదనం అని సీఎండి బలరామ్ వెల్లడించారు. అంతేకాక మిగిలిన బ్యాంకులతో పోలిస్తే.. పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రమాద బీమా మొత్తాన్ని రూ.1.25 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు.
ఇక సింగరేణి కార్మికులు ఎవరైనా మరణిస్తే వారిది సహజమరణమైతే ఆ కుటుంబానికి సంస్థ నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎండీ బలరామ్ తెలిపారు. అలానే అవుట్ సోర్సింగ్ కార్మికుల కోసం రూ.40 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. సంస్థ తీసుకున్న నిర్ణయం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్లాను.. కానీ ఇలా అవుతుందనుకోలేదు.. యాక్టర్ దివి రియాక్షన్..
ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ అశోక్ చంద్ర మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ తీసుకున్న నిర్ణయం.. ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అంతేకాక సంస్థతో తాము కుదుర్చుకున్న ఒప్పందం గురువారం నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. బీమా మాత్రమే కాక సింగరేణి వ్యాపార విస్తరణ ప్రాజెక్టులకు కూడా తమ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పూర్తి సహకారం అందింస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం రూ.కోటి రూపాయలు ప్రమాద బీమా అందించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విద్యుత్ శాఖ ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు కోటి రూపాయల వరకు ప్రమాద బీమా చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈమేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియతో రేవంత్ సర్కార్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa