ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన రైతు పెందూర్ మాధవరావు తన కుటుంబసభ్యులు, 14 మంది కూలీలతో కలిసి పొలం పనులు చేస్తున్నారు. మధ్యాహ్న తర్వాత ఒక్కసారిగా వర్షం పడింది. దీంతో వారంతా సమీపంలోని ఓ పందిరి కిందకు చేరారు. ఆ సమయంలో పిడుగు పడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మాధవరావు (45), సంజన (22), ఎం భీంబాయి (40), ఎస్ రాంబాయి (45)గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన 10 మందిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తొలుత వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తరువాత ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక, బేలా మండలంలో వేర్వేరు సంఘటనల్లో పిడుగుపాటుకు గురై మరో ఇద్దరు మృతి చెందారు. సంగిడి గ్రామంలో వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న నందిని (30) మరణించగా, సోంకాస్ గ్రామంలో ఇలాంటి సంఘటనలో సునీత (35) మరణించింది. ఇదిలాఉంటే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం 6.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు జిల్లాలో నార్నూర్ మండలంలో 42.8 మి.మీ, బేల మండలంలోని చప్రాలలో 32.5 మి.మీ, ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్లో 31.5 మి.మీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో రానున్న 4 రోజులు వర్షాలు... ఇదిలాఉంటే, తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందుకే వర్షాలు కురిసే సమయంలో చెట్లు కింద ఉండొద్దని హెచ్చరించారు. శుక్రవారం (జూన్ 13) రోజున రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం (జూన్ 14) రోజున రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం (జూన్ 15) రోజున రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం (జూన్ 16) రోజున రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa