ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరీంనగర్ వాసులకు ,,, తిరుపతికి ప్రత్యేక రైలు.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 05:13 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటార. తెలంగాణ నుంచి కూడా నిత్యం వేల సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమలకు నేరుగా రైలు సర్వీసులు లేవు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలకు నేరుగా రైలు మార్గంలేని ప్రాంతాల్లో కరీంనగర్ కూడా ఉంది. కానీ ఇప్పుడా ఇబ్బంది తొలగిపోనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి వల్ల కరీంనగర్‌ వాసులు ఇక తమ జిల్లా నుంచే నేరుగా తిరుపతికి వెళ్లవచ్చు. ఆ వివరాలు..


తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు.. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ నుంచి తిరుపతికి.. అలానే తిరుపతి నుంచి కరీంనగర్‌కి 4 చొప్పున 8 ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ ప్రత్యేక రైలు సర్వీసుల ప్రారంభం వెనక మంత్రి పొన్నం కృషి ఎంతో ఉంది. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు సర్వీసు నడపాలని పొన్నం ప్రభాకర్ గతంలో అనేక సార్లు కేంద్ర రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా రైల్వే శాఖ పొన్నం రిక్వెస్ట్‌పై స్పందించింది. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు సర్వీసు ప్రారంభించింది. దీనికి సంబంధించి గురువారం అనగా జూన్ 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈప్రత్యేక రైలు జులై 6-27 తేదీల మధ్య నడిపించనున్నారు.


ఈ ప్రత్యేక రైళ్లు.. ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరతాయి. ఆతర్వాత మరుసటి రోజు అనగా సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ పట్టణానికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు. అలానే కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే ప్రత్యేక రైలు విషయానికి వస్తే.. ఇవి సోమవారం సాయంత్రం 5:30 కి కరీంనగర్ నుంచి ప్రయానం ప్రారంభిస్తాయి. మరుసటి రోజు అనగా మంగళవారం ఉదయం 8:25 కి తిరుపతి చేరతాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ ప్రత్యేక రైలు సర్వీస్‌ను సాధారణ రైలు సర్వీసులుగా కొనసాగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.


తన రిక్వెస్ట్ మన్నించి.. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు వేసిందుకుగాను.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటుగా ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఈ ప్రత్యేక రైలు సర్వీసును ఉపయోగించుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa