కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
కమలాపురం మండలం వంగపల్లిలో గ్రానైట్ వ్యాపారి మనోజ్ క్వారీ నిర్వహిస్తున్నారు. ఈ క్వారీకి సంబంధించి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్రెడ్డి తమను బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సుబేదారి పోలీసులు కౌశిక్రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కౌశిక్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తాజాగా ఈ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa