ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 03:26 PM

కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు తెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటానని, ఇలాంటి విచారణలకు నిరుత్సాహపడనని స్పష్టం చేశారు. "మీ విచారణలు, కమిషన్లు, రాజకీయ ప్రతీకార చర్యలకు నేను ఎప్పటికీ నిరుత్సాహపడను. 420 వాగ్దానాలు, మోసపూరిత డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల అమల్లో వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటాం" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa