తెలంగాణ భవన్లో ఒక్కసారిగా కోలాహలం నెలకొంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు దాదాపు 6 గంటల పాటు విచారించారు. సెల్ఫోన్ తీసుకురాలేదని చెప్పిన కేటీఆర్, అవసరమైతే మరోసారి విచారణకు రావాలని అధికారులు సూచించారు. విచారణ అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ను బీఆర్ఎస్ కార్యకర్తలు పటాకులతో స్వాగతించారు, హరీష్ రావు ఆయనను ఆలింగనం చేసుకుని లోపలికి తీసుకెళ్లారు.
విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్, నోటీసుల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లొట్టపీసు ముఖ్యమంత్రి అంటూ ఘాటు విమర్శలు చేశారు. "మేము పైసలు పెట్టి పదవులు కొనుక్కోలేదు. రేవంత్ రెడ్డికి భయపడేది లేదు. 15 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతాడేమో, అంతకంటే ఎక్కువ వాడు పీకేదేమీ లేదు," అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటనతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేటీఆర్పై ఏసీబీ విచారణ, ఆయన ఘాటు స్పందనలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు తమ నాయకుడికి సంఘీభావం తెలిపిస్తూ తెలంగాణ భవన్ వద్ద ఉత్సాహంగా కనిపించారు. ఈ వివాదం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa