ఫార్ములా ఈ-రేసు కేసులో అవినీతి ఆరోపణలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఏసీబీ అధికారులు తనను పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలు మాత్రమే అడిగారని, అవినీతి ఎక్కడ ఉందో వారినే ప్రశ్నించానని ఆయన వెల్లడించారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని, తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో జైలుకు వెళ్లారని, ఇప్పుడు తమను కూడా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తనను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందని, అయినా తాను దమ్ముగా ఎదుర్కొంటానని ధీమాగా చెప్పారు.
వందల కొద్దీ కేసులు పెట్టినా, జైలు శిక్ష విధించినా తాను బెదిరే ప్రసక్తి లేదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాజకీయంగా తమను అణచివేయాలని చూస్తున్న వారికి తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa