ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు భారీ ఊరట.. వ్యవసాయ పనిముట్లపై 90% సబ్సిడీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 01:55 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే విడుదల చేసిన 'రైతు భరోసా' నిధులతో పాటు, రైతుల భాద్యతలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ప్రకటన చేశారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు వంటి ఆధునిక పనిముట్లపై ప్రభుత్వం 90 శాతం వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఇటీవల రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. పంటల దిగుబడులను పెంచేందుకు, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ పనిముట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, ఈ సబ్సిడీని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా రైతులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన చర్యగా ఆయన వివరించారు.
ఇకపై రైతులు సోలార్ పంపు సెట్లు, వాణిజ్య పంటలు, ఇతర నూతన వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశమని, ప్రతి రైతు అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కొత్త నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులకు మద్దతుగా నిలుస్తుందని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa