తెలంగాణ ప్రభుత్వం రైతుభరోసా పథకం రెండో విడతలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ.1551.89 కోట్లు జమ చేసింది. శుక్రవారం నాడు 3 ఎకరాల వరకు భూమి కలిగిన 10.45 లక్షల మంది రైతులకు, 25.86 లక్షల ఎకరాలకు ఎకరానికి రూ.6,000 చొప్పున నిధులు మంజూరు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక స్థిరత్వం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. 3 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు తొలి దశలో నిధులు అందించినప్పటికీ, ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా మిగిలిన రైతులకు కూడా త్వరలోనే నిధులు జమ చేస్తామని తుమ్మల హామీ ఇచ్చారు. ఈ చర్య రాష్ట్రంలోని అన్ని వర్గాల రైతులకు లబ్ధి చేకూర్చనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతుభరోసా పథకం రైతుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల విడుదలలో పారదర్శకతను కాపాడేందుకు అధికారులు కృషి చేస్తున్నారని, ఎటువంటి ఆటంకాలు లేకుండా అర్హులైన రైతులందరికీ సాయం అందుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన రైతులకు కూడా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa