ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 08:27 PM

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి, అంటే జూన్ 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించింది.పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగుతుంది.ఈ ఏడాది టెట్ కోసం ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 1.83 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో పేపర్-1 కోసం 63,261 మంది, పేపర్-2 కోసం 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లకూ కలిపి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య సుమారు 15 వేల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa