స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్ర దృష్టి సారించింది. ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించి, ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనాయకులతో ఈ సభల నిర్వహణ, ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం.
ప్రభుత్వం ఇటీవల రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేసింది, ఈ నెలాఖరు నాటికి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. ఈ సానుకూల నిర్ణయాన్ని ఓ బూస్టర్గా ఉపయోగించుకొని, స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతును బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం పట్ల సానుకూల భావనలను సభల ద్వారా మరింత బలపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ భారీ సభల ద్వారా పార్టీ తమ హయాంలో సాధించిన విజయాలను, ప్రజలకు చేసిన మేలును వివరించి, స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. రైతు భరోసా నిధుల విడుదలతో పాటు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేస్తూ, ప్రజల్లో విశ్వాసం పెంచే వ్యూహంతో ముందుకు సాగనుంది. ఈ సభలు పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపడమే కాక, ఓటర్లను ఆకర్షించేందుకు కీలకంగా మారనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa