వర్షాకాలంలో మురికి గుంతలు, నీటి నిలువ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందడంతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని జగిత్యాల మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ గంగిలి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. దీనిని నివారించేందుకు మున్సిపల్ అధికారులు దోమల నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఆయిల్ బాల్స్ వినియోగం ద్వారా దోమల పెరుగుదలను అడ్డుకుంటున్నట్లు ఆయన వివరించారు.
వంద రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం మున్సిపల్ పరిధిలోని 4, 8, 10, 13, 30 వార్డుల్లో డ్రైనేజిలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో వెంట వెంకటరమణ, శ్రీకాంత్ జవాన్లు పాల్గొన్నారు. ఈ చర్యలు ప్రజల ఆరోగ్య రక్షణకు, పరిశుభ్రతను పెంపొందించడానికి దోహదపడతాయని అధికారులు తెలిపారు.
దోమల నివారణకు మున్సిపల్ చేపడుతున్న ఈ కార్యక్రమాలు స్థానికుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. వర్షాకాలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులను నియంత్రించేందుకు ఇటువంటి చర్యలు కీలకమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు రాబోయే రోజుల్లో మరిన్ని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa