మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోే కొన్ని వర్గాలు కావాలనే బురద జల్లిస్తున్నాయని ఆరోపించారు. ఆరోపణల్లో నిజం ఉంటే తానే స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈటల ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సమర్థవంతంగా నిర్వహించకపోవడంతోనే సమస్యలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. విచారణలు సమగ్రంగా జరగాల్సిన అవసరం ఉందని, కానీ రాష్ట్ర స్థాయిలో న్యాయం జరగదనే అనుమానం ఉందని అన్నారు.
ఈ కారణంగానే ఈటల రాజేందర్ ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతులు చేసి ప్రజలకు అవసరమైన నీటిని అందించాలన్నది ఆయన హితవు. రాజకీయ విమర్శలు పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యమని ఈటల స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa