దేవనపల్లి పోలీస్ స్టేషన్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఘనంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్ఐ గుండెల రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సాధించవచ్చని, జీవన విధానంలో యోగాన్ని భాగం చేసుకోవాలని ఎస్ఐ గుండెల రాజు సిబ్బందికి సూచించారు.
యోగా సాధన జీవితాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎస్ఐ తెలిపారు. రోజూ యోగాభ్యాసం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, మానసిక స్థిరత్వం, ఒత్తిడి నియంత్రణ కూడా సాధ్యమవుతుందన్నారు. లక్ష్య సాధనకు అవసరమైన ఏకాగ్రతను యోగా ద్వారా పెంపొందించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ సిబ్బంది యోగా పట్ల అవగాహన పెంచుకున్నారు. యోగాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని, ఇది వృత్తిలోనూ సానుకూల మార్పులను తెస్తుందని ఎస్ఐ గుండెల రాజు అభిప్రాయపడ్డారు. ఈ యోగా దినోత్సవం సిబ్బందిలో ఆరోగ్య చైతన్యాన్ని మరర్గొల్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa