తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలు కీలకమైనవని, అయినప్పటికీ వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం నల్గొండలో మాట్లాడిన ఆయన, అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు తగిన గుర్తింపు, సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మేడి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉద్యమకారులకు ఉపాధి అవకాశాలు, గుర్తింపు వంటి హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణించకపోతే ఉద్యమకారులంతా ఏకమై తీవ్ర ఆందోళనలు చేపడతామని మేడి విజయ్ కుమార్ హెచ్చరించారు. తెలంగాణ సమాజంలో అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలకు గౌరవం దక్కాలని, వారి కృషిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa