దేశంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పాలన సాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 'వికసిత్ భారత్ సంకల్ప సభ'లో ఆయన మాట్లాడుతూ, గాంని యూపీఏ పాలనలో ఉగ్రవాద కార్యకలాపాలు జరిగనపుడు నిస్సహాయ పరిస్థితులు ఉండేవని, అయితే బీజేపీ ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి పాకిస్తాన్పై దాడులతో ప్రపంచాన్ని నివ్వెరపరిచిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పాలనలో దేశం సాధించిన పురోగతిని ఆయన వివరించారు.
బీజేపీ ప్రభుత్వం దేశంలో భద్రతను బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాల్లో ఉగ్రవాద ఘటనలపై సమర్థవంతమైన చర్యలు లేకపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యేవారని, కానీ ప్రస్తుతం బీజేపీ పాలనలో దేశం సురక్షితంగా, స్థిరంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సరికొత్త దిశగా పయనిస్తోందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ద్వారా దేశంలోని మేధోశక్తి విదేశాలకు వలసపోకుండా చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం దేశీయ ఉత్పాదనను ప్రోత్సహించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించిందని ఆయన వివరించారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు దేశాన్ని వికసిత భారత్గా మార్చే దిశగా పనిచేస్తున్నాయని ఈటల ఉద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa