ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో ఓ బాలుడు (16) దారుణానికి తెగబడ్డాడు. సోషల్ మీడియాలో పరిచయమైన బాలిక (16)ను బెదిరించి నగ్న వీడియోలు చిత్రీకరించాడు. ఆపై వాటిని తన స్నేహితులకు షేర్ చేశాడు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు మైనర్లు సహా మొత్తం 8 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడికి సోషల్ మీడియా ద్వారా బాధిత బాలిక పరిచయమైంది. ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ను ఉపయోగించుకున్న బాలుడు.. దానిని ఆమె తల్లిదండ్రులకు చూపించకుండా ఉండాలంటే నగ్నంగా వీడియో కాల్ చేయాలని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక అలాగే చేసింది. ఆ వీడియోను రికార్డు చేసిన బాలుడు దానిని తన స్నేహితులకు షేర్ చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. బాలికను మానసికంగా, శారీరకంగా వేధించిన ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఇద్దరు బాలురను నిజామాబాద్లోని జువైనల్ హోంకు, మిగిలిన వారిని రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa